
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
పట్టణ పరిధిలోని గండ్లూరు కాలనీకి చెందిన కదిరి జయమ్మ(45) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
కమలాపురం: పట్టణ పరిధిలోని గండ్లూరు కాలనీకి చెందిన కదిరి జయమ్మ(45) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కమలాపురం ఎస్ఐ మహ్మద్ రఫీ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గండ్లూరు కాలనీకి చెందిన జయమ్మ శనివారం తెల్లవారు జామున విషాహారం తీసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలిసిందన్నారు. సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. మృతురాలు అనుమానాస్పందంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతురాలికి భర్త లాజర్, వివాహిత కుమారుడు కిరణ్ ఉన్నారు. జయమ్మ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.