బైక్‌ను ఢీకొట్టిన లారీ ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ ఇద్దరి మృతి

Published Fri, Aug 5 2016 8:31 PM

Two killed in road accident

 వే గంగా వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. ద్విచ క్రవాహనం పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడిక క్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఫతేపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్, లక్ష్మణ్‌లు బైక్ పై వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో శంకర్, లక్ష్మణ్‌లు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.


 

Advertisement
Advertisement