♦ జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంది.
♦ ఒక్కో గ్రామంలో 300 మంది జ్వర పీడితులున్నారు
♦ 56 మండలాల్లో ఇదే పరిస్థితి
♦ ఎక్కడా డాక్టర్లు సరిగ్గా లేరు.. సరైన మెడిసిన్ లేదు
♦ మీవల్ల సర్కారుకు చెడ్డపేరొస్తోంది
♦ పద్దతి మార్చుకొని ప్రజారోగ్యంపై దృష్టి సారించండి
♦ వైద్యాధికారులపై మంత్రి శిద్దా ఫైర్
ఒంగోలు టౌన్ :
‘ప్రతి గ్రామంలో 250 నుంచి 300 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంటే డాక్టర్స్ ఎక్కడా కరెక్ట్గా లేరు. సరైన మెడిసిన్ లేదు. అదేమని అడిగితే స్టోరీలు చెబుతున్నారు. పద్ధతి మార్చుకొని ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి. మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. జ్వరాలు మాత్రం కంట్రోల్ కావాలి’అని రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. జిల్లాలో జ్వరాల తీవ్రత నేపథ్యంలో మంగళవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 96,524 మంది జ్వర బాధితులు: డీఎంహెచ్ఓ
జిల్లాలో గతేడాది 1,12,254 మంది సాధారణ జ్వరాలతో బాధపడగా.. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 96,524 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.యాస్మిన్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో 11, ఫిబ్రవరిలో 25, మార్చిలో 21, ఏప్రిల్లో 28, మే నెలలో 19, జూన్లో 7, జూన్లో 13, జూలైలో 13, ఆగస్టులో 53, సెప్టెంబర్లో 91 డెంగీ కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ డెంగీ కేసులు పెరిగాయన్నారు.
మంత్రి శిద్దా జోక్యం చేసుకుంటూ తాను 15 రోజుల కిందట దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ వైద్యులు అందుబాటులో లేరని, మందులు కూడా లేవన్నారు. అదే సమయంలో ఒక ఆర్ఎంపీకి చెందిన చిన్న షెడ్లో 50 మంది జ్వర పీడితులు ఉన్నారని, బెడ్స్ లేకపోవడంతో చాపలు, నాపరాళ్లపై పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారన్నారు. ఎంత చెప్పినా మార్పు రావడంలేదని, మీవల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఒంగోలులో కూర్చుంటే కుదరదని, సరైన డైరెక్షన్ ఇస్తూ జ్వరాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సక్రమంగా పనిచేయకపోతే సస్పెండే: కలెక్టర్
జిల్లాలో వ్యాధులను నియంత్రించేందుకు రానున్న మూడు రోజులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్చంద్ ఆదేశించారు. విధులు సక్రమంగా నిర్వహించకుంటే వైద్యులు, వైద్యులైనా, వైద్య సిబ్బంది అయినా, పంచాయతీ కార్యదర్శులైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్యంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఏరోజుకారోజు తనకు నివేదికలు అందించాలని ఆదేశించారు. ఒంగోలుతో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీల్లో జనావాసాల మధ్య పందులు పెంచకుండా ఉండేందుకు, వాటి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
20 రోజుల్లో జిల్లాకు ప్లేట్లెట్స్ మెíషీన్: మంత్రి శిద్దా
20 రోజుల్లో జిల్లాకు ప్లేట్లెట్స్ మెషీన్ వస్తోందని మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్లేట్లెట్స్ మెషీన్కు సంబంధించి టెండర్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలో డెంగీతో ఎవరూ చనిపోలేదని, వివిధ అనారోగ్య కారణాలతోనే చనిపోయారని స్పష్టం చేశారు.
కథలు చెప్పొద్దు
Published Wed, Sep 20 2017 12:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement