ఆర్ట్స్‌ కళాశాలకు రూ.లక్ష విరాళం | rs.lakh donates to arts college | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్‌ కళాశాలకు రూ.లక్ష విరాళం

Sep 9 2016 12:10 AM | Updated on Sep 4 2017 12:41 PM

ఎండోమెంట్‌ క్యాష్‌ప్రైజ్‌ల కోసం రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ పి. మహమ్మద్‌ఖాన్‌ ఆర్ట్స్‌ కళాశాలకు రూ. లక్ష విరాళంగా అందజేశారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఎండోమెంట్‌ క్యాష్‌ప్రైజ్‌ల కోసం రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ పి. మహమ్మద్‌ఖాన్‌ ఆర్ట్స్‌ కళాశాలకు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఈయన ఈ కళాశాలలో 1964–67లో బీఎస్సీ బీజెడ్సీ గ్రూపులో చదివి, ఇదే కళాశాలలో 2000–03 మధ్య బాటనీ అధ్యాపకునిగా పని చేశారు. తర్వాత కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేసి రిటైర్డ్‌ అయ్యారు. తాను చదివిన, బోధించిన కళాశాల పట్ల అభిమానంతో ఈ విరాళం అందజేశారు.

తల్లిదండ్రులైన పి. మహబూబీ, పి. యూసుఫ్‌ఖాన్‌ జ్ఞాపకార్థం డిపాజిట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తంపై వచ్చే వార్షిక వడ్డీని మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరాల బీఎస్సీ బాటనీ సబ్జెక్టులో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా అందజేయాలని కోరారు.  మహ్మద్‌ఖాన్‌ను  ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌. రంగస్వామి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement