ధర్మవరం అర్బన్ : అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్రెడ్డికి ధర్మవరం కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్రెడ్డిని పదిరోజుల క్రితం చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆ హత్య కేసుకు సంబంధించి పట్టణ సీఐ హరినాథ్ తమకు అగించాలని పిటీష¯ŒS వేసి మధుకర్రెడ్డిని ధర్మవరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఐ హరినాథ్ మాట్లాడుతూ ధర్మవరంలో ఏటీఎంలో దొంగతనం, హత్య కేసులో మధుకర్రెడ్డి ప్రధాన నిందితుడని తెలిపారు. మధుకర్రెడ్డిని ధర్మవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామని, న్యాయమూర్తి ఈనెల 27వతేదీ వరకు అతనికి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.