అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కృష్ణమ్మ సాక్షిగా గురువారం నిర్వహించారు.
కృష్ణమ్మ సాక్షిగా..
Aug 18 2016 9:24 PM | Updated on Sep 4 2017 9:50 AM
కొల్లిపర: అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కృష్ణమ్మ సాక్షిగా గురువారం నిర్వహించారు. కృష్ణాపుష్కరాలు జరుగుతున్న నదీ పరివాహక ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం చెలెళ్లు అన్నలకు రాఖీలు కట్టారు. మండల కేంద్రంలోని తిరుపతమ్మగుడికి సమీపంలో ఉన్న కృష్ణానది వద్ద పలువురు చెలెళ్లు అన్నలకు రాఖీలు కడుతూ కనిపించారు. పొట్టిదిబ్బలంకకు చెందిన ముగ్గురు చెలెళ్లు అన్నకు కృష్ణమ్మ సాక్షిగా రాఖీ కట్టారు.
Advertisement


