నూతన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం | new laddu centar, tiruchanuru | Sakshi
Sakshi News home page

నూతన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం

Aug 7 2016 10:45 PM | Updated on Sep 4 2017 8:17 AM

లడ్డూ కౌంటర్‌ను ప్రారంభిస్తున్న డెప్యుటీ ఈవో చిన్నంగారి రమణ

లడ్డూ కౌంటర్‌ను ప్రారంభిస్తున్న డెప్యుటీ ఈవో చిన్నంగారి రమణ

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభమైంది.

తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభమైంది.  ఆలయ డెప్యుటీ ఈవో చిన్నంగారి రమణ ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల భక్తుల రద్దీ పెరగడంతో ఆలయంలోని లడ్డూ కౌంటర్‌ను వెలుపలికి తరలించాలని టీటీడీ ఈవో, జేఈవోలు ఆదేశించినట్లు తెలిపారు.  దీంతో ఓ భక్తుడు అందించిన  రూ.80లక్షల విరాళంతో వాహనమండపం వెనుక నూతన భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు.  ఈ భవనంలో కింది భాగం లడ్డూ కౌంటర్లు, మొదటి అంతస్తులో పరకామణి గదిని ఏర్పాటుచేశామన్నారు. ఇకపై భక్తులకు బార్‌కోడింగ్‌తో కూడిన లడ్డూ టోకెన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పేష్కార్‌  రాధాకృష్ణ, సూపరింటెండెంట్‌ రవి, ఏఈ శివయ్య  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement