పురోహితులకు గుర్తింపు కార్డులివ్వాలి | must identity cards to brahmans | Sakshi
Sakshi News home page

పురోహితులకు గుర్తింపు కార్డులివ్వాలి

Aug 7 2016 11:48 PM | Updated on Sep 4 2017 8:17 AM

కృష్ణ పుష్కరాల సందర్భంగా జిల్లాలోని ప్రతి పురోహితుడికి గుర్తింపుకార్డులు ఇవ్వాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోచంపల్లి రమణారావు ప్రభుత్వాన్ని కోరారు.

భూదాన్‌పోచంపల్లి
 కృష్ణ పుష్కరాల సందర్భంగా జిల్లాలోని ప్రతి పురోహితుడికి గుర్తింపుకార్డులు ఇవ్వాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోచంపల్లి రమణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండలంలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా పుష్కరాలు తెలంగాణకు తొలి పండుగ అన్నారు. తెలంగాణలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు పరిమితమైన ఈ మహోత్సవంలో ఎక్కువ సంఖ్యలో పురోహితులు అవసరమై ఉంటారని, ఈ రెండు జిల్లాల పురోహితులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement