గుంటూరు జిల్లా తెనాలిలో పాతకక్షలు భగ్గుమన్నాయి.
వేటకొడవళ్లతో దాడి : ఒకరి మృతి
Aug 24 2016 11:58 AM | Updated on Jul 30 2018 8:27 PM
-పాతకక్షలతో నలుగురిపై దాడి
తెనాలి : గుంటూరు జిల్లా తెనాలిలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో మండలంలోని నేలపాడు-సిరిపురం రహదారిలో నలుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో బాలయ్య అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురూ ఓ కేసు విషయమై కోర్టుకు వెళ్తుండగా వేట కొడవళ్లతో దాడి చేశారు. వీరంతా కొల్లిపార మండలం తుములూరుకు చెందిన వారు. ఎకరం పొలం విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. బాధితులు ప్రయాణిస్తున్న ఆటోను ప్రత్యర్థులు అంబాసిడర్ తో డీకొట్టి ఆ తర్వాత వేట కోడవళ్లతో దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement