ప్రత్యేక ఉద్యమం కేసులో కోర్టుకు హజరైన ఎమ్మెల్యే | mla attended to court | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ఉద్యమం కేసులో కోర్టుకు హజరైన ఎమ్మెల్యే

Aug 31 2016 10:53 PM | Updated on Mar 23 2019 9:10 PM

కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కళావతి, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు - Sakshi

కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కళావతి, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హదా కోసం ఉద్యమం చేసిన కేసులో స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో పాటు 21 మంది వైఎస్‌ఆర్‌ సీపీ నాయకలు బుధవారం స్థానిక కోర్టుకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి 28న వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.

పాలకొండ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హదా కోసం ఉద్యమం చేసిన కేసులో స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో పాటు 21 మంది వైఎస్‌ఆర్‌ సీపీ నాయకలు బుధవారం స్థానిక కోర్టుకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి 28న వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో డిపో ఎదుట ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే కళావతి, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు పాలవలస విక్రాంత్, వెలమల మన్మదరావు, కడగల రమణ, తుమ్మగుంట శంకరరావు, కనపాక సూర్యప్రకాష్, కోరాడ సూర్యనారాయణబాబు, దుంపల చిన్ని పాలవలస దవళేశ్వరరావు, బలగ మన్మధరావు, కారెపు చిట్టిబాబు, కండాపు ప్రసాదరావు తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బుధవారం వీరంతా న్యాయమూర్తి వివేకానంద్‌ శ్రీనివాస్‌ ముందు హజరై సంతకాలు చేశారు. ఈ కేసును ఈ నెల 22కు వాయిదా వేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement