మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది.
మెదక్ : మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి టోల్గేట్ సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పరశురామ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.