బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన | foundation for bc comunity hall | Sakshi
Sakshi News home page

బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన

Sep 18 2016 9:27 PM | Updated on Sep 4 2017 2:01 PM

బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన

బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన

శోభనాద్రిపురం (రామన్నపేట) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ స్ఫూర్తితోనే రాష్ట్రప్రభుత్వం కొత్తజిల్లాలను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని శోభనాద్రిపురంలో ఏర్పాటుచేసిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు.

శోభనాద్రిపురం (రామన్నపేట) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ స్ఫూర్తితోనే రాష్ట్రప్రభుత్వం కొత్తజిల్లాలను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని శోభనాద్రిపురంలో ఏర్పాటుచేసిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రూ. 5లక్షల ఎంపీల్యాడ్స్‌ నిధులతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీహాలు నిర్మాణానికి శంకుస్థాపనచేసి, సీడీపీ నిధులతో వేసిన బోరుమోటారును ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్‌ సొసైటీ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌–3 ప్రకారమే తెలంగాణరాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు.  కంచి ముత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దళితసేన రాష్ట్ర అధ్యక్షుడు జేబీ.రాజు,  ఎస్సీ వెల్పేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌పీఆర్‌ మల్లేష్‌కుమార్, ఎంపీపీలు కక్కిరేణి ఎల్లమ్మ, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్‌ బొడిగె చంద్రకళ, నార్మాక్స్‌డైరెక్టర్‌ గంగుల కృష్ణారెడ్డి, ముక్కాముల దుర్గయ్య, కంచి శంకరయ్య, విగ్రహదాత గౌరీకృష్ణ, శిల్పి బోదాసు వెంకటరమణ, బందెల రాములు, ఆహ్వాన కమిటీసభ్యులు కంచి మల్లేశం, కంచి యాదయ్య, మధుసూదన్, రాములు, శంకర్, రమేష్, సురేష్, దశరథ, స్వామి, మధు, సుమన్, పొడిచేటి ఎల్లప్ప, సుమన్, ప్రవీన్, సురేందర్‌ పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement