అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి దూర విద్య వార్షిక పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి నిర్వహిస్తునట్లు కర్నూలు రీజనల్ సెంటర్ సహాయ సంచాలకులు డా.ఎం.అజంతకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 25 నుంచి దూరవిద్య పరీక్షలు
Mar 25 2017 11:57 PM | Updated on Oct 1 2018 5:40 PM
కర్నూలు (ఆర్యూ) : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి దూర విద్య వార్షిక పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి నిర్వహిస్తునట్లు కర్నూలు రీజనల్ సెంటర్ సహాయ సంచాలకులు డా.ఎం.అజంతకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు కింద ప్రతి పేపర్కు రూ.100 ప్రకారం ఏప్రిల్ 1వ తేదీలోగా ఏపీ ఆన్లైన్లో చెల్లించాలన్నారు. మూడవ సంవత్సరం రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే నెల 2 నుంచి 7వ తేదీ వరకు, మొదటి సంవత్సర పరీక్షలు మే నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. వివరాలకు బీ.క్యాంపు సిల్వర్ జూబ్లీ కళాశాలలోని స్టడీ సెంటర్లో సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement