
రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాను మృతి
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ జవాను మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన శామీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బస్సు, బైక్ ఢీకొనడంతో ప్రమాదం
మృతుడు తమిళనాడువాసి
శామీర్పేట్: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ జవాను మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన శామీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన కల్యాణ ధర్మారాజు(43) హైదరాబాద్ చాంద్రాయణ్గుట్టలోని క్వార్టర్స్లో ఉంటూ శామీర్పేట్ మండలం జవహర్నగర్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ క్యాంప్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఆయన సోమవారం ఉదయం ఇంటి నుంచి ఉద్యోగానికి తన బైక్పై రాజీవ్రహదారి మీదుగా వస్తున్నాడు. హకీంపేట్ శివారుకు రాగానే నగరం నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు, ధర్మారావు బైక్ రాజీవ్ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పైనుంచి కిందపడిన ధర్మరాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.