'సాక్షి'పై మరోసారి చంద్రబాబు అక్కసు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి 'సాక్షి' దినపత్రికపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి 'సాక్షి' దినపత్రికపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. సాక్షి ఊహాజనిత వార్తలు రాస్తోందని, ఆ పేపర్ను ఎవరు చదవద్దు, టీవీనీ ఎవరు చూడొద్దంటూ ఆయన సూచనలు చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్ పల్స్ సర్వేపై అపోహలు వద్దంటూ ఆయన ఈ సందర్భంగా సాక్షిపై విరుచుకుపడ్డారు.
రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రత్యేక హోదాపై మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా, జీఎస్టీ బిల్లుకు ముడిపెట్టి ఉండాల్సిందన్నారు. కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. మొక్కలు పెంచని సర్పంచ్లు, ఎంపీటీసీలపై అనర్హత వేటు వేస్తామని, అలాగే మొక్కలు పెంచే విద్యార్థులకు అదనపు మార్కులు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా మొక్కలు పెంచే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు.