
ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా బుశెట్టి
శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి కృపతోనే 5వ సారి ఆర్యవైశ్యసభ అధ్యక్షునిగా ఎన్నికయ్యానని ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు పేర్కొన్నారు. స్థానిక పాతమార్కెట్లోని ఆర్యవైశ్య పఠనాలయంలో శుక్రవారం షరాబు వ్యాపారులు సత్కరించారు.
ప్రొద్దుటూరు కల్చరల్:
శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి కృపతోనే 5వ సారి ఆర్యవైశ్యసభ అధ్యక్షునిగా ఎన్నికయ్యానని ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు పేర్కొన్నారు. స్థానిక పాతమార్కెట్లోని ఆర్యవైశ్య పఠనాలయంలో శుక్రవారం షరాబు వ్యాపారులు వరుసగా బుశెట్టి 5సార్లు ఆర్యవైశ్యసభ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవీమాత వైశ్యకులస్తులకే కాక అందరికి దైవమని చెప్పారు. అమ్మవారి కపతోనే ప్రొద్దుటూరు పట్టణం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. బంగారు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని తెలిపారు. ఆర్యవైశ్యసభ గౌరవసభ్యుడు మాలేపాటి వెంకటసుబ్బయ్య, ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహనరావు, కార్యదర్శి చలపతి, కమిటీ సభ్యులు బుశెట్టి రాజశేఖర్, నామా శ్రీధర్లను షరాబు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు గూడూరు రామమనోహర్, జాయింట్ సెక్రటరి మహేష్, ట్రెజరర్ సుబ్బరాజలు పూలమాల వేసి శాలువకప్పి జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో షరాబువ్యాపారస్తుల సంఘం లీగల్ అడ్వైజర్ మధుసూదన్, సంఘ పెద్దలు, స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణ ఆచారి, పట్టణఅధ్యక్షుడు మున్వర్ హుసేన్, స్వర్ణకారులు, పురప్రముఖులు పాల్గొన్నారు.