బైక్‌ ఢీకొని వృద్ధురాలి మృతి | Bike collided..women died | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని వృద్ధురాలి మృతి

Sep 17 2016 10:29 PM | Updated on Sep 4 2017 1:53 PM

మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె వద్ద శనివారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో నాగదాసరి సుబ్బమ్మ(52) మృతి చెందింది.

బద్వేలు అర్బన్‌: మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె వద్ద శనివారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో నాగదాసరి సుబ్బమ్మ(52) మృతి చెందింది. చెన్నంపల్లె సమీపంలోని ప్రగతినగర్‌ లో నివసించే ఆమె కూలి పనులు చేసుకొని జీవన ం సాగిస్తూ ఉండేది. శనివారం రాత్రి ఇంటి సమీపంలోని దుకాణం వద్దకు రోడ్డు దాటుకొని నడిచి వెళ్తుండగా.. బద్వేలు నుంచి నాగిశెట్టిపల్లెకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఓ యువకుడు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది.వెంటనే స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement