ఏటీఎం దొంగ అరెస్టు | ATM ROBBERY | Sakshi
Sakshi News home page

ఏటీఎం దొంగ అరెస్టు

Jul 23 2016 11:31 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఇతరుల ఏటీఎం కార్డుల వివరాలతో, వారికి తెలియకుండా నగదు కాజేస్తున్న హైదరాబాద్‌ చింతల్‌కు చెందిన రామిరెడ్డి రోషన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పేకేటి సారధి ఫిర్యాదు మేరకు సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో..

కాకినాడ సిటీ : ఇతరుల ఏటీఎం కార్డుల వివరాలతో, వారికి తెలియకుండా నగదు కాజేస్తున్న హైదరాబాద్‌ చింతల్‌కు చెందిన రామిరెడ్డి రోషన్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఈ మేరకు టూటౌన్‌ పోలీసులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన పేకేటి సారధి ఫిర్యాదు మేరకు సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై కె.వంశీధర్, కానిస్టేబుల్‌ కె.రూప్‌కుమార్‌ దర్యాప్తు చేసి, నిందితుడిని స్ధానిక కోకిలా సెంటర్‌లో అరెస్టు చేశారు. ఆరు నెలలుగా రోష¯Œæరెడ్డి ఏటీఎంల వద్ద ఉంటూ, అమాయకుల ఏటీఎం కార్డులను మోసపూరితంగా తీసుకున్నాడు. తణుకు, గుడివాడ, వినుకొండ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, కాకినాడల్లో ఈ నేరాలకు పాల్పడ్డాడు. బాధితుడు సారధి ఖాతా నుంచి రూ.15 వేలు, మిలిగిన చోట్ల సుమారు రూ.4 లక్షలు కాజేశాడు. ఆయా కేసుల్లో నిందితుడు వినియోగించిన టెక్నాలజీని ఛేదించి, బ్యాంకుల నుంచి సెల్‌ఫోన్‌ డేటా ద్వారా అతడిని పట్టుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement