కోర్టులో అగ్రిగోల్డ్ చైర్మన్ | Agrigold Chairman produced in Eluru Court | Sakshi
Sakshi News home page

కోర్టులో అగ్రిగోల్డ్ చైర్మన్

Feb 12 2016 11:06 AM | Updated on Aug 11 2018 8:21 PM

కోర్టులో అగ్రిగోల్డ్ చైర్మన్ - Sakshi

కోర్టులో అగ్రిగోల్డ్ చైర్మన్

అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాసు వెంకటేశ్వరావు, ఆయన సోదరుడు కుమార్‌లకు 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఏలూరు మెజిస్ర్టేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏటూరు: అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాసు వెంకటేశ్వరావు, ఆయన సోదరుడు కుమార్‌లకు 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఏలూరు మెజిస్ర్టేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  సీఐడీ పోలీసులు శుక్రవారం ఏలూరు కోర్టులో వారిని హాజరుపరిచారు. వీరిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు రిమాండ్ విధించింది. అనంతరం వారిని వైద్య పరీకల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా  హైకోర్టుల ఆదేశాల మేరకు హైదరాబాద్ లో గురువారం రాత్రి వీరిని అరెస్టు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో పలు జిల్లాల్లో బాధితులు పోలీసు స్టేషన్‌లలో కేసులు పెట్టారు. దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

కాగా, బకాయి పడ్డ రూ. 105 కోట్లు చెల్లించకపోవడంతో పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయాన్ని ఆంధ్రాబ్యాంక్ సీజ్ చేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ కేసు ఈరోజు హైకోర్టులో విచారణ కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement