కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట వాసి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందాడు.
కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట వాసి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన బొక్కెనపెల్లి లక్ష్మీరాజ్యం(47) బతుకు తెరువు కోసం దుబాయి వె ళ్లాడు. నాలుగు నెలల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి వెళ్లిన లక్ష్మీరాజ్యం గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. లక్ష్మీరాజ్యానికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.