గణితం పేపర్‌–2 పరీక్షకు 255 మంది గైర్హాజరు | 255 absent of mathematics paper | Sakshi
Sakshi News home page

గణితం పేపర్‌–2 పరీక్షకు 255 మంది గైర్హాజరు

Mar 24 2017 11:11 PM | Updated on Sep 5 2017 6:59 AM

పదో తరగతి పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన గణితం పేపర్‌–2 పరీక్షకు జిల్లాలో 255 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన గణితం పేపర్‌–2 పరీక్షకు జిల్లాలో 255 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 49,224 మంది విద్యార్థులకు గాను 48,969 మంది హాజరయ్యారు. ప్రాథమిక విద్యాశాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి ఎనిమిది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ఏడు కేంద్రాలు, స్క్వాడ్‌ బృందాలు 80 కేంద్రాలను తనిఖీ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement