1,150 కిలోమీటర్ల మేర ఐవోసీ పైప్‌లై న్‌ | 1,150 kilometers ioc pipeline | Sakshi
Sakshi News home page

1,150 కిలోమీటర్ల మేర ఐవోసీ పైప్‌లై న్‌

Dec 22 2016 12:16 AM | Updated on Sep 4 2017 11:17 PM

1,150 కిలోమీటర్ల మేర ఐవోసీ పైప్‌లై న్‌

1,150 కిలోమీటర్ల మేర ఐవోసీ పైప్‌లై న్‌

జంగారెడ్డిగూడెం : ఒడిసాలోని పారాదీప్‌ ఆయిల్‌ శుద్ధి కర్మాగారం నుంచి హైదరాబాద్‌ వరకు 1,150 కిలోమీటర్లు ఆయి ల్‌ పైప్‌లై న్‌ వేయనున్నట్టు పైప్‌లై న్‌ ప్రాజెక్ట్‌ కేంద్ర ప్రభుత్వ అధీకృత అధికారి కె.అనిల్‌జెన్సీసన్‌ తెలిపారు.

జంగారెడ్డిగూడెం : ఒడిసాలోని పారాదీప్‌ ఆయిల్‌ శుద్ధి కర్మాగారం నుంచి హైదరాబాద్‌ వరకు 1,150 కిలోమీటర్లు ఆయి ల్‌ పైప్‌లై న్‌ వేయనున్నట్టు పైప్‌లై న్‌  ప్రాజెక్ట్‌ కేంద్ర ప్రభుత్వ అధీకృత అధికారి కె.అనిల్‌జెన్సీసన్‌ తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) ఈ పైప్‌లైన్‌ను సుమారు రూ.2 వేల కోట్లతో వేయనుందన్నారు. పైప్‌లైన్‌ రాష్ట్రం లో 675 కిలోమీటర్ల మేర ఉంటుందని, జిల్లాలోని 10 మండలాల మీ దుగా పైప్‌లైన్‌ వెళుతుందని చెప్పారు. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌లో ప్రత్యేక ఫిల్లింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటుచేస్తామన్నారు. పైప్‌లైన్‌కు ప్రాథమిక సర్వే పూర్తయిందని చెప్పారు. 18 మీటర్ల వెడల్పు, మీటరున్నర లోతులో పైప్‌లైన్‌ ఉంటుందన్నారు. సమావేశంలో ఐవోసీ చీఫ్‌ కనస్ట్రక్షన్స్‌  మేనేజర్‌ బీవీఎస్‌ ప్రసాద్, సైట్‌ ఇంజనీర్లు విశ్వతేజ, చైత్ర తహసీల్దార్‌ జీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement