భర్తకు టోపీ పెట్టి..నగలు, నగదుతో.. | Wife Cheated Second Husband In karnataka | Sakshi
Sakshi News home page

భర్తకు టోపీ..

Aug 23 2018 12:22 PM | Updated on Aug 23 2018 12:24 PM

Wife Cheated Second Husband In karnataka - Sakshi

బనశంకరి :  వయసు మీద పడిన శ్రీమంతులను టార్గెట్‌ చేసుకుని  పెళ్లి పేరుతో  ఓ కిలాడీ లేడీ భర్త కన్నుగప్పి నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... శ్రీరాంపుర నివాసి సయ్యద్‌ కరీం అనే వ్యక్తి మొదటి భార్య మృతి చెందడంతో జబీదాబానును రెండో వివాహం చేసుకున్నాడు. వివాహమైన కొత్తలో భర్తతో అన్యోన్యంగా ఉంది. అయితే ఈనెల 17న జబీదా ఇంటిలో ఉన్న రూ. 7 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించింది. 2015లో కూడా రాజాజీనగరలో జబీదాబా మొదటి భర్త చాంద్‌బాషా ఇంట్లో కూడా తన తడాకా చూపడంతో పోలీసులకు పట్టుబడింది.

అనంతరం మొదటి భర్త చాంద్‌పాషాను వదిలిపెట్టిన జబీదా రెండో వివాహం సయ్యద్‌ కరీంను చేసుకుంది. వివాహం అయిన వెంటనే ఆస్తి మొత్తం తన పేరుతో రాసివ్వాలని పీడించేది. దీంతో జబీదా పేరుతో సయ్యద్‌ రూ. 30 లక్షలు పెట్టి ఓ స్థలం కొనుగోలు చేశాడు. ఇంటిలో ఉంటూనే చోరీ చేస్తూ పట్టుబడింది. దీంతో పలుమార్లు కరీం భార్యను మందలించాడు. ఏరోజైతే భార్య పేరుతో స్థలం కొనుగోలు చేశాడో అదే రోజు బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు, నగదుతో ఉడాయించింది. బాధితుడు సయ్యద్‌ శ్రీరాంపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కిలాడీ లేడి కోసం గాలిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement