నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి!

Published Wed, Mar 6 2019 1:39 PM

Road accident In Nalgonda District - Sakshi

సాక్షి, నల్గొండ : జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టాటా ఏస్‌ వాహనం ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌ నుంచి దేవరకొండవైపు వస్తున్న టాటాఏస్‌ వాహనం నాగార్జున సాగర్‌ హైవేపై కొండపల్లి మండలం చెన్నారం వద్దకు రాగానే టైర్‌ పేలడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటాఏస్‌ వాహనంలోని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మందికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మార్గమధ్యంలో చనిపోవడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement