మాట్లాడుతుండగా పేలిన సెల్ఫోన్

వ్యక్తికి గాయాలు
హొసూరు, బనశంకరి: బైక్మీద వెళ్తూ స్మార్ట్ఫోన్లో మాట్లాడుతుండగా ఫోన్ పేలిపోయింది. పేలుడుతో కంగారుపడిన ద్విచక్రవాహనదారుడు కిందపడి గాయపడ్డాడు. సూళగిరి సమీపంలోని కురుబరపల్లికి చెందిన ఆర్ముగం ఆదివారం బైక్ మీద ఆనేకల్ వద్ద వస్తుండగా కాల్ రావడంతో సెల్ఫోన్లో మాట్లాడుతూనే బైక్ నడుపుతున్నారు. మాట్లాడుతూ ఉండగానే సెల్ఫోన్ పెద్ద శబ్దంతో పేలింది. చెవికి, కణతకు గాయాలయ్యాయి. కిందపడిపోయాడు. గాయపడిన ఆర్ముగంను స్థానికులు సూళగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పోలీసులు విచారించి కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి