నటి సింధూ మీనన్‌ సోదరుడిపై కేసు

Case filed against actress Sindhu Menon brother - Sakshi

సాక్షి, కర్ణాటక (యశవంతపుర) : నటి సింధూ మీనన్‌కు కష్టాలు వెంటాడుతున్నాయి. బ్యాంకును మోసగించారని మూడు రోజుల క్రితం నింధూపై కేసు నమోదు చేసిన ఆర్‌ఎంసీ యార్డు పోలీసులు తాజాగా మంగళవారం ఆమె సోదరుడు మనోజ్‌కార్తీపై యశ్వంతపుర పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. మనోజ్‌ కార్తీ, సుధా, రాజశేఖర్‌లు గణేశ్‌ రావు అనే వ్యక్తికి చెందిన భవనాన్ని లీజ్‌ తీసుకున్నారు. లీజు పత్రాలను నకిలీ సృష్టించి రుణం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టాడు. విషయాన్ని గుర్తించిన భవన యజమాని గణేశ్‌ రావు యశ్వంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top