ముంబై: స్నాప్డీల్కు చెందిన మొబైల్ వాలెట్ ప్లాట్ఫార్మ్ ఫ్రీచార్జ్ను సాఫ్ట్బ్యాంక్ విక్రయించనున్నదని సమాచారం. దీనికి సంబంధించి కొన్ని సంస్థలతో సాఫ్ట్బ్యాంక్ చర్చలు జరుపుతోందని డీల్ విలువ 15–20 కోట్ల డాలర్ల రేంజ్లో ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్నాప్డీల్ను మరో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ కంపెనీ ఫ్లిప్కార్ట్కు సాఫ్ట్బ్యాంక్ విక్రయించనున్నదన్న వార్తల నేపథ్యంలో ఫ్రీచార్జ్ విక్రయ వార్తలు రావడం విశేషం. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆలీబాబా యాజమాన్యంలోని పేటీఎమ్ సంస్థ ప్రీచార్జ్ ను కొనుగోలు చేయొచ్చని సమాచారం.
రెండేళ్ల క్రితం ప్రీచార్జ్ను స్నాప్డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ 40 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కాలంలో నిధుల కోసం ఫ్రీచార్జ్ సంస్థ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పేపాల్, పేయూలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా కొన్ని నెలల క్రితం ప్రీచార్జ్ను కొనుగోలు చేయడానికి విజయ శేఖర్ శర్మ నేతృత్వంలోని పేటీఎమ్ సంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్ను సంప్రదించిందని, అప్పుడు జాస్పర్ ఇన్ఫోటెక్ 50 కోట్ల డాలర్లు డిమాండ్ చేసిందని సమాచారం. ఒక దశలో ప్రీచార్జ్ విలువను 90 కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. కాగా గత మూడు నెలల్లో స్నాప్డీల్, ప్రీచార్జ్లకు సంబంధించి చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ప్రీచార్జ్ కోసం 15 కోట్ల డాలర్లనే పేటీఎమ్ ఆఫర్ చేస్తోందని సమాచారం.
అమ్మకానికి ఫ్రీచార్జ్ రేసులో పేటీఎమ్ !
Published Fri, Apr 7 2017 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
Advertisement