అమ్మకాల్లో అగ్రస్థానం ఆల్టో | Alto is in top in selling | Sakshi
Sakshi News home page

అమ్మకాల్లో అగ్రస్థానం ఆల్టో

Mar 21 2018 12:20 AM | Updated on Mar 21 2018 12:20 AM

Alto is in top in selling  - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో గత నెలలో అత్యధికంగా అమ్ముడైన పది కార్లలో మారుతీ సుజుకీ కంపెనీ కార్లు ఆరు చోటు సంపాదించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్ల తొలి ఐదు స్థానాల్లో మారుతీ కార్లే ఉన్నాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది, హ్యుందాయ్‌ కంపెనీకి చెందిన మూడు కార్లు ఈ జాబితాలో ఉండగా,  మహీంద్రాకు చెందిన యుటిలిటి . వెహికల్‌ బొలెరోకు రెండేళ్ల తర్వాత  స్థానం లభించింది. దాదాపు రెండేళ్ల తర్వాత బాగా అమ్ముడైన టాప్‌ 10 కార్లలో ఈ కారుకు చోటు దక్కింది.  

ఈ జాబితాలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో మొత్తం 19,760 ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో 19,524 ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి.  
 గత ఏడాది ఫిబ్రవరి జాబితాలో ఐదో స్థానంలో ఉన్న స్విప్ట్‌ కారు  ఈఏడాది ఫిబ్రవరి జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది.  
 గత ఏడాది టాప్‌–10 జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్న మారుతీ బాలెనో ఈ సారి ఏకంగా నాలుగో స్థానంలోకి దూసుకువచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement