అమ్మకాల్లో అగ్రస్థానం ఆల్టో
టాప్–10లో 6 మారుతీవే
న్యూఢిల్లీ: భారత్లో గత నెలలో అత్యధికంగా అమ్ముడైన పది కార్లలో మారుతీ సుజుకీ కంపెనీ కార్లు ఆరు చోటు సంపాదించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్ల తొలి ఐదు స్థానాల్లో మారుతీ కార్లే ఉన్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది, హ్యుందాయ్ కంపెనీకి చెందిన మూడు కార్లు ఈ జాబితాలో ఉండగా, మహీంద్రాకు చెందిన యుటిలిటి . వెహికల్ బొలెరోకు రెండేళ్ల తర్వాత స్థానం లభించింది. దాదాపు రెండేళ్ల తర్వాత బాగా అమ్ముడైన టాప్ 10 కార్లలో ఈ కారుకు చోటు దక్కింది.
♦ ఈ జాబితాలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. గత నెలలో మొత్తం 19,760 ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో 19,524 ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి.
♦ గత ఏడాది ఫిబ్రవరి జాబితాలో ఐదో స్థానంలో ఉన్న స్విప్ట్ కారు ఈఏడాది ఫిబ్రవరి జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది.
♦ గత ఏడాది టాప్–10 జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్న మారుతీ బాలెనో ఈ సారి ఏకంగా నాలుగో స్థానంలోకి దూసుకువచ్చింది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు