ఎయిర్‌టెల్‌ రూ.149 ప్లాన్‌ : డబుల్‌ ఆఫర్‌ | Airtel Rs. 149 Recharge Refreshed Again, Now Offers 2GB Data per Day | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ రూ.149 ప్లాన్‌ : డబుల్‌ ఆఫర్‌

Jun 9 2018 5:31 PM | Updated on Jun 9 2018 5:39 PM

Airtel Rs. 149 Recharge Refreshed Again, Now Offers 2GB Data per Day   - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ:  టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఇస్తున్న గట్టిపోటీని తట్టుకునేందుకు ఎప్పటికపుడు  వ్యూహాలను మారుస్తున్న  మరో దిగ్గజ టెలికాం ఆపరేటర్‌ భారతి  ఎయిర్‌టెల్‌  తాజాగా తన రీచార్జ్‌ప్లాన్‌ మళ్లీ సవరించింది.  రూ.149  ప్రీపెయిడ్‌ ప్యాక్‌పై వినియోగదారులకు డబుల్‌ డేటా  ప్రయోజనాలను ఆఫర్‌ చేస్తోంది. ముఖ్యంగా జియో  రూ.198 ప్లాన్‌కు కౌంటర్‌గా అదనపు ప్రయోజనాలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రణాళికలో భాగంగా  ఆ సవరణ చేసింది.

ఎయిర్‌టెల్‌ రూ.149ల ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై ఇపుడు 2జీబీ  2జీబీ/3జీబీడేటాను ఆఫర్‌ చేస్తోంది. ఇప్పటివరకూ 1 జీబీ మాత్రమే అందిస్తుండగా తాజా నిర్ణయంతో  డబుల్‌ ధమాకాడేటా ఆఫర్‌ను ప్రకటించింది.  ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. రూ. 2.68కు జీబీ డేటా చొప్పున  మొత్తం 56 జీబీ డేటాను కస్టమర్లకు అందివ్వనుందన్నమాట. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.  అయితే పరిమితమైన చందాదారులకు కుమాత్రమే అందుబాటు ఉన్నట్టు తెలుస్తోంది. జియో రూ.198 ప్యాక్‌లో 28రోజుల వాలిడిటీతో రోజుకు 1.5జీబీ చొప్పున 42 జీబీ అందిస్తోంది.  గత నెలలోనే రూ.399  ప్రీపెయిడ్ రీచార్జ్‌ ప్లాన్‌ను సవరించిన ఎయిర్‌టెల్‌ 1.4జీబీ బదుకుగా 2.4జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement