జెట్ ఎయిర్‌వేస్ చార్జీల డిస్కౌంట్ ఆఫర్

జెట్ ఎయిర్‌వేస్ చార్జీల డిస్కౌంట్ ఆఫర్


ముంబై: దేశీ విమాన ప్రయాణికుల కోసం జెట్ ఎయిర్‌వేస్ చార్జీల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు తమ టిక్కెట్లను దాదాపు 90 రోజులు ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. ఈ టిక్కెట్ ధరలు రూ.1,933 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ టిక్కెట్లతో ప్రయాణికులు జూలై 1 నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమానాలలో ప్రయాణించ వచ్చు. ఢిల్లీ-ముంబై ప్రయాణపు టిక్కెట్ ధర రూ. 3,004, బెంగళూరు-ముంబై ప్రయాణపు టిక్కెట్ ధర రూ. 2,459గా ఉంది. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారికి 30-50 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top