మంగంపేట బైరటీస్‌ గనుల వద్ద తీవ్ర ఉద్రిక్తత | YSRCP MLA Koramutla Srinivasulu Protest At Mangampet Mines | Sakshi
Sakshi News home page

మంగంపేట బైరటీస్‌ గనుల వద్ద తీవ్ర ఉద్రిక్తత

Nov 12 2018 12:51 PM | Updated on Nov 12 2018 1:00 PM

YSRCP MLA Koramutla Srinivasulu Protest At Mangampet Mines - Sakshi

సాక్షి, వైఎస్‌ఆర్‌: కడప జిల్లా మంగంపేట బైరటీస్‌ గనుల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూములు కొల్పొయిన బాధితులు పరిహారం కోసం ఆరు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. వీరికి మధ్దతు తెలిపేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు ధర్నా ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా  పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. దీంతో ధర్నా ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.


Advertisement
 
Advertisement
Advertisement