కలహం వద్దు.. కలిసే ఉందాం
‘‘అంతా కలిసి ఉందాం. దశాబ్దాలుగా కలిసి ఉన్న గ్రామస్థులు కేవలం ఒకరిద్ద రు చేసిన తప్పులకు కులపరంగా విడిపోవడం బాధాకరం.
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు వివాదంతో దళితులను సాంఘిక బహిష్కరణకు గురి చేసిన గరగపర్రు గ్రామాన్ని శుక్ర వారం ఆయన సందర్శించారు. ఇరు వర్గాల ప్రజలను కలిశారు. సమస్య పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు వర్గాల ప్రజలతో మాట్లాడి, సమస్యను పరిష్కరించేందుకు వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని నేతృత్వంలో పార్టీ నేతలు మేరుగ నాగార్జున, కొయ్యే మోషెన్రాజు, పాతపాటి సర్రాజు, కారుమూరి నాగే శ్వరరావు, ముదునూరు ప్రసాదరాజు, గ్రంథి శ్రీనివాస్లతో ఒక కమిటీని వైఎస్ జగన్ నియమించారు.
దాని వల్ల మన ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు’’ అని జగన్ సూచించారు. స్థానిక సర్పంచ్ ఎలిజబెత్తోపాటు గ్రామానికి చెందిన పలువురు తమ అభిప్రాయాలను ఆయనతో పంచుకున్నారు. ‘‘గతంలో చెరువుకట్టపై అన్ని విగ్రహాలు, గుళ్లు ఉండేవి. వినాయకుడి విగ్రహం పెట్టే సమయంలో ఏర్పడిన వివాదం నేపథ్యంలో అన్నింటినీ తొలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 23న అర్ధరాత్రి సమయంలో అక్కడ దళితులు అంబేడ్కర్ విగ్రహాన్ని పెడితే అ«ధికా రులు తొలగించారు. దాంతో మాకు సంబం ధం లేదు. అంబేడ్కర్ అంటే మాకు కూడా ఎంతో గౌరవం ఉంది’’ అని దళితేతరులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ... కోర్టు తీర్పు ఉంటే కోర్టే చూసు కుంటుంది. అక్కడ అంబేడ్కర్ విగ్రహం పెట్టడానికి మీకు అభ్యంతరం లేదు కదా! అని అడిగారు.
తమకు అభ్యంతరం లేదని గ్రామ స్థులు బదులిచ్చారు. ‘‘మనలో ఒకరో ఇద్దరో తప్పు చేసి ఉండొచ్చు... అలా జరిగి ఉండ కూడదని మనం కూడా ఒప్పుకోవాలి.. తప్పు లను సరిదిద్దుకోవాలి. ఎప్పటిలాగే మన మంతా కలిసిమెలిసి ఉందాం’’ అని కోరారు. దీనికి దళితేతరులు అంగీకరించారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా తప్పులు జరిగాయని, తమ వారినే అరెస్టు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు జరిగిందన్న ఉద్దేశంతోనే తహసీల్దార్, స్థానిక ఎస్ఐలపై వేటు వేయనున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రకటించిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఒకరిద్దరు చేసిన తప్పును అందరికీ ఆపాదించవద్దని, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉందామని సూచించారు.
వైఎస్ జగన్ స్పందిస్తూ... తాను ఇక్కడికి వచ్చే ముందు దళితేతరులతో మాట్లాడానని, సమా చార లోపం వల్ల వివాదం పెరిగిందని చెబు తున్నారని, వారు కూడా కలిసి ఉండేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు. ‘‘రాజీ చేసుకోవడానికి, ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి అంగీకారంగానే ఉన్నాం. ఎందుకంటే మనం ఒకే గ్రామంలో ఉన్నాం. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే బతుకుతున్నాం.. ఇక్కడే మరణిస్తాం. అయితే, చట్ట ప్రకారం జరగాల్సిన న్యాయం జరగాలి. అందరూ చెడ్డవారు కాదు. గ్రామంలో వివాదంపై ప్రభుత్వమే విచారణ చేసింది. తహసీల్దార్, ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇవన్నీ చేశారంటే ఆధా రాలు ఉండబట్టే చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. చట్టాన్ని తన పని తాను చేసుకుపో నివ్వండి. అన్ని కులాలు మంచివే. కొంత మంది చెడ్డవారు ఉన్నారు.
వారిపై మాత్రమే కోపం గానీ వారి కులాలపై కాదు. అందరం కలసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నా మంటూ ఒక సందేశాన్ని ఈ వేదిక నుంచి పంపిద్దాం. తప్పు చేసిన వారికి మాత్రమే శిక్ష పడేలా చేయండి. మిగలిన వారిపై ఎలాంటి కోపం లేదు. గ్రామంలో మళ్లీ మంచి జరగాలి కాబట్టి అందరూ గతాన్ని మరిచిపోయి కలసి కట్టుగా అడుగు ముందుకు వేయాలి. సమస్య పరిష్కారానికి ఆళ్ల నాని ఆధ్వర్యంలో ఒక కమి టీని వేస్తున్నాం’’ అని జగన్మోహన్రెడ్డి ప్రక టించారు. అనంతరం ‘‘అన్నా! మీరు మా దళితవాడకు వచ్చారు. ఇక్కడే భోజనం చేసి వెళ్లాలి’’ అని మహిళలు చేసిన విజ్ఞప్తి మేరకు జగన్ అక్కడ ఉన్న చర్చికి వెళ్లి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.


