269వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

YS Jagan 269th Day Prajasankalpayatra Begins - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. సోమవారం ఉదయం జననేత 269వ రోజు పాదయాత్రను పెందుర్తి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సారిపల్లి, జంగాలపాలెం, చింతలపాలెం, తాడివానిపాలెం, దేశపాత్రుని పాలెం, కొత్త వలస మీదుగా తుమ్మికపాలెం వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. కొత్తవలసలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగసభలో ప్రజలనుద్దేశించింది ప్రసంగించనున్నారు.  దేశపాత్రునిపాలెం చేరుకోగానే జననేత మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటనున్నారు.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.

చదవండి: నేడు విజయనగరంలోకి ప్రజాసంకల్పయాత్ర

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top