మహిళను గొడ్డలితో నరికి దారుణహత్య | Woman Brutally Murdered In westgodavari district | Sakshi
Sakshi News home page

మహిళను గొడ్డలితో నరికి దారుణహత్య

Dec 30 2013 8:13 PM | Updated on Sep 2 2017 2:07 AM

మానవత్వం మంటగలుస్తోంది. సమాజంలో రోజురోజుకీ మనిషిన్నవాడూ మాయమైపోతున్నాడు. మనిషి మనిషిని చంపుకునే క్రూర సంస్కృతి దాపరించింది.

ఏలూరు: మానవత్వం మంటగలుస్తోంది. సమాజంలో రోజురోజుకీ మనిషిన్నవాడూ మాయమైపోతున్నాడు. మనిషి మనిషిని చంపుకునే క్రూర సంస్కృతి దాపరించింది. భూముల కోసం, ఆస్తులు కోసం,  పగలు ప్రతీకారల కోసం హత్యలు చేయడం సర్వ సాధారణం అయింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.

తాజాగా ఓ మహిళను అతిదారుణంగా  గొడ్డలితో నరికి చంపిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలం గుటాలలో చోటుచేసుకుంది. భూవివాద విషయంలో మహిళపై ప్రత్యర్ధులు కక్ష కట్టి చంపినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement