సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి | We want united Andhra Pradesh, says Kavuri Sambasivarao | Sakshi
Sakshi News home page

సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి

Nov 19 2013 11:47 AM | Updated on Sep 27 2018 5:59 PM

సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి - Sakshi

సమైక్యవాదాన్నే వినిపించాం: కావూరి

జీవోఎం ముందు సమైక్యవాదాన్నే వినిపించామని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు.

ఏలూరు : జీవోఎం ముందు సమైక్యవాదాన్నే వినిపించామని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పాస్ చేస్తే తామేమీ చేయలేమని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానంతోనే పోరాడతామని కావూరి తెలిపారు. అయితే మద్దతు కోసం ఇతర పార్టీ నేతలను కలిసే ఆలోచన లేదని ఆయన అన్నారు.

కాగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిన్న జీవోఎం సభ్యులకు నివేదికను అందజేశారు.   కేంద్ర మంత్రులంతా తమ అభిప్రాయాలను జీవోఎంకు చెప్పారు. ఒక్కొక్కరు 10 నిమిషాలకుపైగానే మాట్లాడారు. అయితే  అందరూ స్థూలంగా విభజనకు అంగీకరిస్తూనే తద్వారా తలెత్తే సమస్యలను పరిష్కరించాలంటూ కోర్కెల చిట్టా విప్పారు. కిశోర్ చంద్రదేవ్ మినహా మిగిలిన వారంతా హెచ్‌ఎండీఏ పరిధిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement