అలిపిరి వద్ద భక్తులపై మానసిక రోగి దాడి | unknown person attack devotees in alipiri | Sakshi
Sakshi News home page

అలిపిరి వద్ద భక్తులపై మానసిక రోగి దాడి

Feb 15 2014 8:53 AM | Updated on Sep 2 2017 3:44 AM

అలిపిరి వద్ద భక్తులపై మానసిక రోగి దాడి

అలిపిరి వద్ద భక్తులపై మానసిక రోగి దాడి

అలిపిరి నుంచి నడక మార్గం ద్వారా తిరుమలకు వెళుతున్న భక్తులపై ఓ మానసిన రోగి దాడి చేశాడు.

తిరుమల : తిరుమలలో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అలిపిరి నుంచి నడక మార్గం ద్వారా తిరుమలకు వెళుతున్న  భక్తులపై ఓ మానసిన రోగి దాడి చేశాడు. రాళ్లతో కొట్టడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో చెన్నైకి చెందిన ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. అయితే మిగిలిన భక్తులు గట్టిగా కేకలు వేయడంతో, సదరు వ్యక్తి పారిపోయాడు. గాయపడిన భక్తులు ప్రస్తుతం తిరుమల అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మతి స్థిమితం లేని వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement