గుర్తు తెలియని వాహనం ఢీ: ఇద్దరు మృతి | Two killed at hit and run accident in Guntur District | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీ: ఇద్దరు మృతి

Nov 2 2014 10:03 AM | Updated on Apr 3 2019 7:53 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల సమీపంలోని రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల సమీపంలోని రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్కు గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతుల వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement