గరుడ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

TSRTC garuda bus catches fire in krishna district - Sakshi

సాక్షి, విజయవాడ : తెలంగాణ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం అధికారులు వారిని వేరే బస్సులో తరలించారు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రికల్‌ వైరింగ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top