'రేషన్ పంపిణీకి ఆధార్ లింక్ లేదు' | there is no aadhar link with ration distribution yet, paritala sunitha | Sakshi
Sakshi News home page

'రేషన్ పంపిణీకి ఆధార్ లింక్ లేదు'

Jul 11 2014 5:51 PM | Updated on Sep 4 2018 5:07 PM

'రేషన్ పంపిణీకి ఆధార్ లింక్ లేదు' - Sakshi

'రేషన్ పంపిణీకి ఆధార్ లింక్ లేదు'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆధార్ కార్డు జారీ చేసిన తరువాతే రేషన్ పంపిణీతో అనుసంధానం చేస్తామని పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు.

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఆధార్ కార్డులు జారీ చేసిన తరువాతే  రేషన్ పంపిణీతో అనుసంధానం చేస్తామని పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రేషన్ పంపిణీకి, ఆధార్ కు లింక్ లేదని తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సునీత.. రేషన్ డీలర్లు ఎవరైనా అక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రతి జిల్లాలో ఉల్లిపాయ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సునీత పేర్కొన్నారు.ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. వంద రోజుల్లో లక్ష దీపం కనెక్షన్లు ఇస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement