లారీ ఢీ కొని వ్యక్తి మృతి | The death of the person who bought a lorry collided | Sakshi
Sakshi News home page

లారీ ఢీ కొని వ్యక్తి మృతి

Mar 27 2015 9:44 PM | Updated on Sep 2 2017 11:28 PM

వేగంగా వెళ్తున్న లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.

గూడూరు(నెల్లూరు జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా గూడూరు మండలం పోడ్‌పాలెం సర్కిల్ సమీపంలో జరిగింది. వివరాలు.. గూడూరు మండలం రాణిపేట గ్రామానికి చెందిన బండి లక్ష్మయ్య (65) వాటర్ ప్లాంట్‌లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వేగంగా వస్తున్న లారీ తన టీవీఎస్ ఎక్సైల్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement