నేడు సుబ్రహ్మణ్య కాలనీలో పర్యటన
కష్టాలు తీర్చుతారని స్థానికుల ఎదురుచూపు
అనకాపల్లి: అనకాపల్లి మండలంలో పార్లమెంట్ బృందం పర్యటనపై స్థానికులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. 31 మందితో కూడిన పార్లమెంట్ సభ్యుల బృందం ఆదివారం ఉదయం హుద్హుద్కు నష్టపోయిన ఏఎమ్ఏఎల్ కళాశాలను, సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలోని సుబ్రహ్మణ్యకాలనీని సందర్శించనున్నారు. తుఫాన్ కారణంగా అనకాపల్లి మండలంలోని సుబ్రహ్మణ్య కాలనీ తీవ్రంగా నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపధ్యంలోనే అక్కడ స్థిరపడిన వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వగా, అధికారులు సైతం ఇదే తరహా సంకేతాలు పంపించారు. తుఫాన్ పోయి మూడు నెలలు అవుతున్న తరుణంలో పార్లమెంట్ బృందం చేపట్టనున్న పర్యటన బడుగు, బలహీన వర్గాలలో ఆశలు రేపుతోంది. 11 ఏళ్ల క్రితం సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలోని 388/2 సర్వే నెంబర్లో సుబ్రహ్మణ్య కాలనీ దశలవారీగా ఏర్పడింది. 22 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ వందలాది మంది ఆవాసాలను ఏర్పరుచుకున్నారు. వీరంతా రోజువారీ కూలీ పనులు చేసుకోవడంతోపాటు వలస కుటుంబాలకు చెందినవారే. తుఫాన్ తరువాత అందరి దృష్టి సుబ్రహ్మణ్య కాలనీవాసులపైనే పడింది. ప్రస్తుతమిది వాగు పోరంబోకు స్థలంలో ఉందని ఇటీవల పర్యటించిన ఇతర జిల్లాల ప్రతినిధులు నివేదించారు.
కాని 11 ఏళ్లుగా స్థిర నివాసమేర్పరుచుకున్న సుమారు 400 కుటుంబాలకు ఎల్పీసీలు ఇచ్చే విషయంలో రెవెన్యూ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనుకంజ వేస్తున్నారు. సుబ్రహ్మణ్య కాలనీలో నివాసముంటున్న వారంతా తెల్లవారుజామునే సమీపంలోని అనకాపల్లి పరిసర ప్రాంతాలలో పనులు చేసుకునేవారే. వాగు పోరంబోకు కావడంతో అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సుబ్రహ్మణ్యం కాలనీలోనే పక్కా ఇళ్లు నిర్మించడం ఒక ప్రతిపాదన. సమీపంలోని సంపత్పురం 2/2 సర్వే నెంబర్లో ఐదెకరాల స్థలంలో పక్కా ఇళ్లు నిర్మించడం మరో ప్రతిపాదన. సుమారు 412 ఇళ్లు నిర్మించాలని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఆదివారం పర్యటించనున్న పార్లమెంటరీ బృందం స్థానికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు.
తహసీల్దార్ పర్యటన
సుబ్రహ్మణ్య కాలనీలో ఆదివారం పార్లమెంట్ బృందం పర్యటించనున్న నేపధ్యంలో తహశీల్దార్ భాస్కరరెడ్డి, ఆర్ఐ సుభాకర్, గాయత్రి, హౌసింగ్ డీఈ ధనుంజయ్ తదితరులు శనివారం ఎఎమ్ఎఎల్ కళాశాల, సుబ్రహ్మణ్యం కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు.
పార్లమెంట్ బృందం పైనే ఆశలు
Published Sun, Jan 11 2015 1:00 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
కేసులను సత్వరమే పరిష్కరించాలి
రుణమాఫీకి కసరత్తు !
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
ప్రమాదాలకు చెక్!
యాదాద్రిలో ఊంజలి సేవ
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement