స్నేహ బంధం తెగింది | Teenager killed in road accident | Sakshi
Sakshi News home page

స్నేహ బంధం తెగింది

Aug 4 2014 2:26 AM | Updated on Sep 2 2017 11:19 AM

స్నేహ బంధం తెగింది

స్నేహ బంధం తెగింది

స్నేహితుల దినోత్సవం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. స్నేహితుల్లో ఒకరిని శాశ్వతంగా దూరం చేసింది. ఈ సంఘటనతో తోటి స్నేహితులు, వారి తల్లిదండ్రులకు వేదనను మిగిల్చింది.

  •     రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం  
  •      అతని ఇద్దరు స్నేహితులకు గాయాలు
  •      స్నేహితుల దినోత్సవం నాడు విషాదం
  • మాకవరపాలెం : స్నేహితుల దినోత్సవం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. స్నేహితుల్లో ఒకరిని శాశ్వతంగా దూరం చేసింది. ఈ సంఘటనతో తోటి స్నేహితులు, వారి తల్లిదండ్రులకు వేదనను మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని పైడిపాలకు చెందిన ఆడారి శ్రీనివాసరావు(25), వెంకటాపురానికి చెందిన మర్రి సన్యాసినాయుడు(25), జంగాలపల్లికి చెందిన ఎస్.గణేష్(26)లు స్నేహితులు. వీరు డిగ్రీవరకు నర్సీపట్నంలో కలిసి చదువుకున్నారు.

    ప్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆదివారం ముగ్గురూ మోటారు సైకిల్‌పై నర్సీపట్నం వచ్చారు. సాయంత్రం  తిరిగి ఇంటికి వెళ్తుండగా కొండలఅగ్రహారం గ్రామ శివారున ఉన్న సర్పానది వంతెన వద్దకు వెళ్లే సరికి బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో శ్రీనివాసరావుకు తలపైన, సన్యాసినాయుడుకు నడుముపై తీవ్ర గాయాలయ్యాయి.  గణేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. 108లో వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

    ఇక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టోల్‌గేట్‌లో పని చేస్తున్న శ్రీనివాసరావు, సన్యాసినాయుడు మూడు రోజుల క్రితం స్వగ్రామాలకు వచ్చారు. ఇంతలో శ్రీనివాసరావు మృతి చెందడంతో తల్లిదండ్రులతోపాటు, తోటి స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement