దౌర్జన్యంతోనే టీడీపీ విజయం:వై. వెంకటరామిరెడ్డి | tdp plays backstabing politics, says y venkata rami reddy | Sakshi
Sakshi News home page

దౌర్జన్యంతోనే టీడీపీ విజయం:వై. వెంకటరామిరెడ్డి

Jul 3 2014 1:48 PM | Updated on Aug 10 2018 8:08 PM

జిల్లాలోని గుత్తి చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది.

అనంతపురం:జిల్లాలోని గుత్తి చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది. తొలుత వైఎస్ఆర్‌సీపీకి మద్దతు తెలిపిన నలుగురు ఇండిపెండెంట్లను టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తమ వైపుకు తిప్పుకోవడంతో ఆ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీకి మద్దతిచ్చిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థులను జేసీ ప్రలోభ పెట్టి టీడీపీ వైపు లాక్కున్నారని వైఎస్సార్ సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థులు జేసీతో వాగ్వావాదానికి దిగారు. టీడీపీ అరాచకాలకు ఇదొక పరాకాష్ట అని వైఎస్సార్ సీపీ నేత వై. వెంకటరామిరెడ్డి మండిపడ్డారు.కేవలం టీడీపీ దౌర్జన్యంతోనే విజయం సాధించిందని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement