చీపురుపల్లి: రోడ్డుపై వెళ్తుండగా వంద రూపాయల నోటు కనిపిస్తే చటుకున్న వంగి తీసుకుని జేబులో వేసుకునే ఈ రోజుల్లో..పక్కపక్కనే ప్రయాణిస్తూ జేబులు కత్తిరించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాంటిది ఎవ్వరూ లేని ఏటీఎంలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.25 వేలు దొరికితే ఇంకేమైనా ఉందా. పట్టుకుని ఉడాయించేస్తారు కదా..! కానీ అంతా అలాగే చేస్తారనుకుంటే పొరపాటే.. అందులో భాగంగా చీపురుపల్లి పట్టణానికి చెందిన సిరేల శ్రీను అనే యువకుడు ఎంతో నిజాయితీగా వ్యవహరించి ఏటీఎంలో లభ్యమైన ఆ డబ్బులను ఏం చేయాలో తెలియక సాక్షి ప్రతినిధిని ఆశ్రయించాడు.
దీంతో సాక్షి, ఆ యువకుడు సంయుక్తంగా పోలీస్స్టేషన్కు వెళ్లి దొరికన డబ్బులను పోలీసులకు అప్పగించారు. ఎంతో నిజాయితీగా వ్యవహరించిన ఆ యువకుడిని అందరూ అభినందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. స్థానిక మెయిన్రోడ్లో గల పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి డబ్బులు తీసుకునేందుకు స్థానిక జి.అగ్రహారం ప్రాంతానికి చెందిన సిరేల శ్రీను అనే ఎంబీఏ విద్యార్థి శుక్రవారం ఉదయం 11.16 గంటల సమయంలో వెళ్లాడు. ఆయన లోపలకు వెళ్లేసరికి ఆ ఏటీఎం యంత్రంలో నుంచి రూ.25వేలు నగదు, విత్డ్రా స్లిప్ బయటకు వచ్చాయి.
లోపల చూస్తే ఎవ్వరూ లేరు. ఆ డబ్బులను తీసుకున్న శ్రీను ఎవరైనా వస్తారేమోనని దాదాపు అరగంట వరకు అక్కడే వేచి ఉన్నాడు. ఎవ్వరూ రాకపోవడంతో ఏం చేయాలో తెలియక సాక్షి ప్రతినిధిని ఆశ్రయించాడు. దీంతో వారిద్దరూ సంయుక్తంగా చీపురుపల్లి పోలీస్స్టేషన్కు వెళ్లి ఎస్సై ఎం.నాగేశ్వరరావుకు వివరించి, నగదును, విత్డ్రా స్లిప్ను హెచ్సీ కామేశ్వరరావుకు అప్పగించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ స్టేట్బ్యాంకును సంప్రదించి వాస్తవంగా ఈ డబ్బులు ఏ ఖాతాదారునికి చెందినవో తెలుసుకుని వారికి అప్పగించే చర్యలు చేపడతామ న్నారు. నిజాయితీగా వ్యవహరించిన యువకుడు శ్రీను, సాక్షి పత్రికను ఈ సందర్భంగా ఎస్సై అభినందించారు.
సూపర్ శ్రీను
Published Sat, Sep 5 2015 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement