బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన | students dharna due to buses | Sakshi
Sakshi News home page

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

Feb 16 2016 10:43 AM | Updated on Sep 3 2017 5:46 PM

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు.

యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ యాజమాన్యం తమ గ్రామానికి రోజూ నడపుతున్న బస్సుల సంఖ్యను తగ్గించడంతో రోడ్డుపై ధర్నా చేశారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. స్కూలు కు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బస్సుల సంఖ్య పెంచాల్సిందిగా డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో కాసేపు రాకపోకలకు అంతరాయమేర్పడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement