ప్రత్యేక హోదాపై స్పష్టత ఏది? | state, centeral govts should respond on ap special status: yv subbareddy | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై స్పష్టత ఏది?

Sep 21 2015 11:51 AM | Updated on May 28 2018 1:52 PM

కేసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ప్రత్యేక హోదా విషయం పట్టించుకోవటం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

విశాఖపట్నం: కేసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ప్రత్యేక హోదా విషయం పట్టించుకోవటం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయాన్ని నీతి ఆయోగ్కు అప్పగించామన్న కేంద్రం, నెల రోజులైనా స్పష్టత ఇవ్వలేదన్నారు.

ఈ నెల 25లోగా ప్రత్యేక హోదా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం ప్రకటించాలి, లేదంటే ఈ నెల 26న వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించటంతోనే మా ఎన్నికల విజయ ప్రస్థానం ప్రారంభమవుతుందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement