రైతుల్లో ‘నైరుతీ’ ఆశల మోసులు..! | Southwest Monsoon is creating hopes among farmers | Sakshi
Sakshi News home page

రైతుల్లో ‘నైరుతీ’ ఆశల మోసులు..!

Jun 27 2020 4:23 AM | Updated on Jun 27 2020 4:23 AM

Southwest Monsoon is creating hopes among farmers - Sakshi

సాక్షి, అమరావతి: నైరుతీ రుతుపవనాలు రైతుల్లో ఆశల మోసులు రేకెత్తిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందస్తు అంచనాల కంటే అధిక వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందంగా పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఈ నెల ఒకటో తేదీతో ఆరంభమైన ఖరీఫ్‌ (నైరుతీ) సీజన్‌లో ఇప్పటి (జూన్‌ 26వ తేదీ) వరకూ చూస్తే ఏడు జిల్లాల్లో సాధారణం కంటే 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం, అయిదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 

► ఒక్క చిత్తూరు జిల్లాదీ మాత్రమే 21 శాతం కంటే తక్కువ వర్షపాతంతో లోటు జాబితాలో ఉంది. (30 ఏళ్ల సగటు వర్షపాతంతో పోల్చితే..)
► జిల్లాల వారీగా చూస్తే నెల్లూరులో 58శాతం, గుంటూరు– 43, కర్నూలు–38, విజయనగరం–31, కృష్ణా–30, అనంతపురం– 23,  ప్రకాశం–21 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
► వైఎస్సార్‌ కడప, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement