తూర్పుగోదావరి: యువతీ యువకుల ఆలోచనల్లో పరిణతి కనిపిస్తోంది. ఉత్సాహమే ఊపిరిగా జీవించే యువత రాష్ట్ర భవిష్యత్పై దృష్టి సారిస్తోంది. భావి తరాల జీవన విధానం మెరుగ్గా ఉండాలంటే జగన్ సీఎం కావాలని ఆకాంక్షిస్తోంది. భవిష్యత్పై భరోసా కోరుకుంటున్నారు. పాదయాత్రలో పిఠాపురం అగ్రహారానికి చెందిన డి.శైలజ రాష్ట్రానికి జననేత జగన్ సీఎం కావాలంటూ ప్లకార్డును ప్రదర్శించింది. జగనన్నకు చూపించి తన ఆశ సారాంశాన్ని వివరించింది. ‘వియ్ లవ్ జగనన్న, వియ్ నీడ్ జగనన్న ఫర్ బెటర్ గవర్నమెంట్ అండ్ అవర్ బ్రైట్ ఫ్యూచర్’ అంటూ ప్లకార్డుపై రాసి ఉంది.


