కొన‘సాగు’తున్న రాజీవ్ స్వగృహ నిర్మాణాలు
ఇప్పటికి 16 మందే చేరిక.. మరికొద్ది మంది సిద్ధం
నిర్మాణ ం పూర్తి అయిన ఇళ్లు 189
వాటిలో చేరేందుకు లబ్ధిదారుల అనాసక్తి
డిపాజిట్ వాపసుకు 1300 మంది దరఖాస్తు
ఎచ్చెర్ల:నిర్మాణాల్లో బాగా జాప్యం జరగడం, ఇప్పటికీ పూర్తిస్థాయిలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం తదితర కారణాలతో రాజీవ్ స్వగృహలో చేరేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. కొద్దిమంది ఇళ్లలో చేరినా అసౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి అయిన ఇళ్లను వేలం వేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి ధరల్లో వాటిని కొనుగోలు చేసేందుకు ఎంతమంది ముందుకు వస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మధ్యతరగతి లక్ష్యంగా..
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలన్న ఉన్నతాశయంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రారంభించి, దీని పర్యవేక్షణకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని ఎస్.ఎం.పురం కొండపై సర్వే నెంబర్ 112లో 100 ఎకరాల స్థలం కేటాయించారు. అందులో 1094 ఇళ్లు నిర్మించి, దరఖాస్తుదారులకు రుణప్రాతిపదికన అందజేయాలని నిర్ణయించారు. ఆరు కేటగిరీలో నిర్మించే ఈ ఇళ్లకు నిర్ణయించిన ధరలు కూడా అందుబాటులో ఉండటంతో 5018 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.3వేలు చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు సైతం చెల్లించి ఆశగా ఎదురుచూశారు.
వైఎస్ అనంతరం నిర్లక్ష్యం
అయితే వైఎస్ మరణానంతరం ఈ పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును దాదాపు మూలన పడేశాయి. 1094 ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా తొలివిడతలో 200 ఇళ్లు నిర్మించి ఇవ్వాలనుకున్నారు. అయితే 189 నిర్మాణాలు ప్రారంభించి 54 మాత్రమే పూర్తి చేశారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికి 16 ఇళ్లలో లబ్ధిదారులు చేరగా, మరికొందరు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగతా ఇళ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ప్రారంభంలో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.228 కోట్లు కేటాయించగా.. అందులో స్థలం చదును చేయడానికే రూ.24 కోట్లు వ్యయమైంది.
విశాఖకు చెందిన ఎస్వీసీ కాంట్రాక్టు సంస్థ నిర్మాణాలు చేపట్టగా ప్రస్తుతం అనమిత్ర కార్పొరేషన్ చేపడుతోంది. కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించినా ప్రధానమైన రోడ్డు సౌకర్యం కల్పించలేదు. జాతీయ రహదారి నుంచి ఇళ్లు ఉన్న ప్రాంతానికి రావడానికే సరైన రహదారి లేదు. దీనికితోడు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో దరఖాస్తుదారులు స్వగృహపై ఆసక్తి చూపడం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 1300 మంది ధరావత్తు సొమ్ము వాపసు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నిర్మాణం పూర్తి అయిన ఇళ్లను వేలం వేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం వేలం నిర్వహించనుండటంతో ప్రభుత్వం మొదట ప్రకటించిన ధర కంటే సుమారు 30 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇంత ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బిల్లు.. ఇళ్ల కోసం.. ఎదురుచూపులు
మరోపక్క ఇందిరమ్మ,ఆర్ పీహెచ్ వంటి ఇళ్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో రచ్చబండలో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ల బకాయిలు ఇప్పటికీ లబ్ధిదారులకు అందలేదు. అధికారంలోకి రాక ముందు లక్ష ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని చెప్పిన తెలుగుదేశం నేతలు అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. జిల్లాలో 19 వేల మంది లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తుండగా.. మరో 25 వేల మంది ఇళ్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరా అవాస్ యోజన(ఐఏవై) ఇళ్లు మంజూరు చేసేవారు. అలాగే మురికివా డల వారికి వాల్మీకి అంబేద్కర్ అవాస యోజన(వాంబే) ఇళ్లు ఇచ్చే వారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక ఇవేవీ అమలు కావడంలేదు.
చెదిరిన ‘స్వగృహ’ కల
Published Mon, Mar 2 2015 1:20 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement