ప్రత్యేక హోదా కోసం 2న భిక్షాటన: శివాజి | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం 2న భిక్షాటన: శివాజి

Published Wed, May 27 2015 2:03 AM

ప్రత్యేక హోదా కోసం 2న భిక్షాటన: శివాజి - Sakshi

విజయవాడ (గాంధీనగర్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జూన్ 2న భిక్షాటన చేపట్టబోతున్నట్టు సినీనటుడు శివాజీ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితుల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రత్యేక హోదా కోసం మూడు నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. అందుకే తాను శాంతియుతంగా ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేశారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement